Hyderabad

హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్ల‌కు సీఎం సూచ‌న‌లు…

February 12, 2026
By SandeshamTimes

ఢిల్లీ: హైద‌రాబాద్‌-బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్‌-చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్ల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి క‌న్స‌ల్టెంట్ సంస్థకు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ త‌యారీ బాధ్య‌త‌ను రైల్వే శాఖ RITES క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌కు అప్ప‌జెప్పింది. ఆ సంస్థ ప్ర‌తినిధులు ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అలైన్‌మెంట్లు, డీపీఆర్‌కు సంబంధించి వారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్. శ్రీనివాసరాజు, సెక్రటరీ కో ఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, RITES ఈడీ లలిత్ కుమార్ పాల్గొన్నారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play