*దేవుని పవిత్రతను దెబ్బతీయడం మహాపాపం: CM చంద్రబాబు*
* అమరావతి: చిన్నప్పటి నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంలో చాలానిష్ఠగా ఉండేవాళ్లమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా పరీక్షలు రాసినప్పుడు దేవుడి వద్దకు నడిచి వెళ్లేవాళ్లమన్నారు. ఇటీవల కొన్ని అపచారాలు జరిగాయని చెప్పారు. తాను మళ్లీ సీఎం కాగానే ప్రక్షాళన మొదలుపెట్టానని, ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే ప్రస్తావించినట్లు తెలిపారు. దేవుని పవిత్రత దెబ్బతీయడం మహాపాపమన్నారు. ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని అసెంబ్లీలో మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేశారు.