మరవెల్లి గ్రామంలో శివ స్వాముల కలశం పూజ —గురు స్వామి బస్వరాజు ఆధ్వర్యంలో
వట్పల్లి ఫిబ్రవరి 3 ( సందేశం టైమ్స్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి టి సంగమేశ్వర్)సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పరిధిలో నీ మరవెల్లి గ్రామంలోని తమ్మాలి సంగమ్మ స్వగృహంలో ఘనంగా నిర్వహించిన శివ స్వాముల కలశం పూజా కార్యక్రమంలో పరమశివుని పూజలు, భజన, కీర్తనలతో భక్తులను ఆహ్లాదపరిచారు. గురు స్వామి బస్వరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీ. సంగమేశ్వర్ స్వామి, శేఖర్ స్వామి, నేరడిగుంట గురు స్వామి, శ్యామ్ స్వామి, సంగమేష్ స్వామి, శివహరి స్వామి, అరునోదయ్ స్వామి, మనోజ్ స్వామి, నందు స్వామి, వెంకటేశం కత్తి స్వామి, నాగేష్ స్వామి, శివకుమార్ కత్తి స్వామి, మహేష్ కన్నె స్వామి, కిరణ్ కన్నె స్వామి, రాజు కన్నె స్వామి పాల్గొని శివాగోషాలను పలికారు. కార్యక్రమం సంప్రదాయ వైభవంతో, భక్తిమయ వాతావరణంలో ఘనంగా ముగిసింది.